హెడ్కానిస్టేబుల్ ఔదార్యం
విజయనగరం టౌన్ : ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఓ యువతికి రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచాడు హెడ్కానిస్టేబుల్ పెండ్యాల శ్రీనివాసరావు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల ఓ ఉన్మాది చేతిలో గాయపడి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్రంది గౌతమికి అత్యసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమైంది. బాధితురాలి తల్లిదండ్రులు రక్తం అన్వేషణలో ఉండగా విషయం తెలుసుకున్న టూటౌన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు వెళ్లి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఉమెన్ కమిషన్ మెంబర్ శ్రీవాణి, వైద్యులు, సీఐ దుర్గాప్రసాద్, తదితరులు పెండ్యాలను అభిందించారు. ఇదిలా ఉంటే తాను ఇప్పటికి ఎనిమిదిసార్లు రక్తదానం చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు.