నారాయణ్ఖేడ్ ఉప ఎన్నికలో అపశ్రుతి
నారాయణఖేడ్ : మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక సందర్భంగా శనివారం అపశ్రుతి చోటు చేసుకుంది. మండలంలోని కొండాపూర్ గ్రామ పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న హరిసింగ్ (48) అనే హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. హరిసింగ్ పటాన్చెరు పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. మరో ఘటనలో నారాయణఖేడ్ పట్టణంలోని నెహ్రూనగర్లో విధుల్లో ఉన్న ఓ వీడియోగ్రాఫర్ కూడా స్పృహ తప్పిపడిపోయాడు. అతడ్ని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.