హరిత తెలంగాణకు తరలి వచ్చిన కేసీఆర్‌లు

హరిత తెలంగాణకు తరలి వచ్చిన కేసీఆర్‌లు - Sakshi


కరీంనగర్‌కల్చరల్‌: హరితహారం మూడో విడుత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కరీంనగర్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌కు మానేరు విద్యా సంస్థల విద్యార్థులు కేసీఆర్‌ మాస్క్‌లతో వినూత్న తరహాలో స్వాగతం పలికారు. మానేరు స్కూల్‌ నుంచి సిరిసిల్ల బైపాస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేదిక వద్దకు 400 మంది విద్యార్థులు తరలివచ్చారు.


హరితహారానికి స్ఫూర్తిని కలిగిస్తూ మాస్క్‌లతో వచ్చిన విద్యార్థులను అధికారులు, ప్రజలు, నాయకులు అభినందించారు. విద్యాసంస్థల చైర్మన్‌ కడారు అనంతరెడ్డి సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ సునీతారెడ్డితోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ నాటిన మొక్క వద్ద హరిత తెలంగాణను సాధిద్దాం అంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top