హజ్ యాత్రికులకు ఎమ్మెల్యే రేవంత్రెడ్డి చేయూత
కొడంగల్ : హజ్యాత్రకు వెళ్లే ముస్లింములకు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. కొడంగల్లోని దారుల్ ఉలూం పాఠశాలలో బుధవారం యాత్రికులను సన్మానించారు. నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట, మద్దూరు, కోస్గి మండలాల నుంచి హాజ్ యాత్రకు ఆరుగురి ఎంపికవగా వారిని సన్మానించారు.
ఎండీ సులేమాన్, రియాసత్ ఖాన్, అల్లావుద్దీన్, ఎం.ఏ మోహీద్లతోపాటు మరో ఇద్దరు మహిళలు హజ్కు వెళ్తున్నారు. రూ.1.25లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా మందిరాల సందర్శనతో పుణ్యంతో పాటు జ్ఞానం పెరుగుతుందన్నారు. సంస్కతి సంప్రదాయాలు తెలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతిరెడ్డి, మహ్మద్ యూసూఫ్, ప్రశాంత్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.