టి.లింగాలపాడులో తుపాకీ కలకలం!
జలుమూరు : టి.లింగాలపాడులో నాటు తుపాకీతో వేట సాగుతోందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గడిచిన ఆదివారం గ్రామంలో ఒక విందు భోజనం జరిగిన సమయంలో తలెత్తిన వివాదానికి సంబంధించి జలుమూరు పోలీసులు వెళ్లారు. అదే సమయంలో గ్రామానికి చెందిన చల్ల భుజంగరావు తుపాకీతో సమీప చెరువులో బాతులను వేటాడుతుండగా పోలీసులు పసిగట్టి ఎస్ఐ నరసింహామూర్తికి సమాచారం ఇచ్చారు.
ఎస్ఐ ఆదేశాల మేరకు తుపాకీతో పాటు వేట సాగిస్తున్న భుజంగరావును రెండు రోజులు కిందట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. తుపాకీ ఎక్కడ నుంచి తెచ్చింది ఎందుకు కొనుగోలు చేసిందీ తదితర వివరాలు రాబెట్టారు. అనంతరం పరిశీలించి ఎయిర్ రైఫిల్గా గుర్తించి విడిచిపెట్టినట్లు సమాచారం. ఈ విషయమై ఎస్ఐ నరసింహామూర్తిని వివరణ కోరగా టి.లింగాలపాడులో తుపాకీతో వేట సాగిస్తున్నట్లుగా సమాచారం రావడం నిజమేనని గ్రామానికి చెందిన చల్ల భుజంగరావు, తుపాకీని తెచ్చి విచారించామని చెప్పారు. ఎయిర్రైఫిల్గా గుర్తించి ప్రమాదకరమైనది కాదని నిర్దారించి సంబంధిత వ్యక్తిని ఇంకోసారి ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించి విడిచిపెట్టామన్నారు.