ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు వైద్యంపై నిఘా..!
► రహస్యంగా విచారణ చేయిస్తున్న ప్రభుత్వం
► జిల్లాకు చెందిన ఓ వైద్యాధికారి
విజయనగరంఫోర్ట్: ప్రైవేటు ప్రాక్టీస్ చేసే ప్రభుత్వ వైద్యులపై ప్రభుత్వం నిఘా పెట్టింది. విధులకు డుమ్మూకొడుతూ ప్రైవేటు ప్రాక్టీస్కు పరిమితమయ్యే వారి వివరాలను రహస్యంగా సేకరిస్తోంది. వారి ఉద్యోగతీరును విచారణ అధికారులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో 68 పీహెచ్సీలు, 11 సీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. వీటిలో 300 మంది వైద్యులు పనిచేస్తున్నారు. పీహెచ్సీల్లో అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాలి.
సీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రిల్లో అయితే 24 గంటల పాటు అందుబాటులో ఉండాలి. అయితే, చాలామంది వైద్యులు ఓపీ వేళల్లో కూడా ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నారన్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. విచారణ నివేదికలు ఆధారంగా ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకోనున్నారు.
కొనసాగుతున్న విచారణ
జిల్లాకు చెందిన ఓ వైద్యాధికారి శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులు కిందటే విచారణ ఆరంభించారు. ప్రైవేటు క్లినిక్లు నిర్వహిస్తున్న ప్రభుత్వ వెద్యుల వివరాలు సేకరిస్తున్నారు. విజియనగరం జిల్లాలో కూడి ఇతర జిల్లాలకు చెందిన వైద్యాధికారులు విచారణ చేపట్టినట్టు స మాచారం. దీంతో ప్రైవేటు ప్రాక్టీస్ చేసే వైద్యుల్లో టెన్షన్ మొదలైంది.