బాలిక కిడ్నాప్, ఆపై లైంగిక దాడి

బాలిక కిడ్నాప్, ఆపై లైంగిక దాడి - Sakshi


లైంగికదాడికి పాల్పడ్డాడని బాధితురాలి ఫిర్యాదు

సత్యవేడు: చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని చెరివి పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన బాలిక(13)ను కిడ్నాప్ చేసి ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే, తమకు న్యాయం చేయాలని బాధితుల తరఫు బంధువులు శనివారం రాత్రి పోలీసులను ఆశ్రయించడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 17వ తేదీన చెరివి ఎస్టీ కాలనీలో ఇంటి వద్ద ఉన్న ఓ బాలికను ఆమె తండ్రి తీసుకురమ్మన్నాడని చెప్పి రామచంద్రాపురం ఎస్టీ కాలనీకి చెందిన కోటయ్య అనే వ్యక్తి ద్విచక్రవాహనంలో తీసుకెళ్లాడు. తన కుమార్తె కనిపించకపోవడంతో ఆ రోజు నుంచి ఆమె తండ్రి గ్రామంలో వాకబు చేశాడు.



రామచంద్రాపురం ఎస్టీకాలనీకి చెందిన వ్యక్తి తన కూతుర్ని తీసుకెళ్లినట్లు తెలుసుకుని ఈనెల 24వ తేదీన సత్యవేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న కిడ్నాప్ చేసిన వ్యక్తి బంధువులు బాలికను సత్యవేడు పోలీస్‌స్టేషన్ సమీపంలో బాధిత బాలికను వదిలి వెళ్లారు. వెంటనే బాధితురాలు తమ పంచాయతీ సర్పంచ్‌తో కలిసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను కిడ్పాప్ చేసిన వ్యక్తి ఆరంబాకం(తమిళనాడు)లోని సెల్లమ్మ సెంటర్ వద్ద ఉన్న తమ బంధువుల ఇంట్లో 11 రోజులు ఉంచి లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపింది. తమకు న్యాయం చేయాలని శనివారం రాత్రి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై స్పందించేందుకు పోలీసులు అయిష్టత చూపినట్లు తెలుస్తోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top