డెంగీతో విద్యార్థిని మృతి
మహబూబాబాద్ : డెంగీతో డిగ్రీ విద్యార్థిని మృతిచెందిన సంఘటన మానుకోట పట్టణంలో శనివారం జరిగింది. కాలనీవాసుల కథనం ప్రకారం.. పట్టణంలోని హరిజనవాడకు చెందిన చింతకుంట్ల శ్రీనాథ్, శ్రీలత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే శ్రీనాథ్ మృతిచెందాడు. వారి కుమార్తె శ్రావణి(19) వరంగల్లో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. 15రోజుల క్రితం ఆమెకు డెంగీజ్వరం వచ్చింది. దీం తో ఖమ్మం, హైదరాబాద్లో చికిత్స చేయించారు. అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతదేహాన్ని నాయకులు పర్కాల శ్రీనివాస్రెడ్డి, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, సూర్నపు సోమయ్య, పుచ్చకాయల కృష్ణ, తప్పెట్ల వీరన్న సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు