1,00,000 గారెలతో నివేదన

1,00,000 గారెలతో నివేదన


అమలాపురం రూరల్: హనుమజ్జయంతి సందర్భంగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం పేరూరు శివారు బండివారి అగ్రహారంలో దాసాంజనేయ స్వామికి భక్తులు లక్ష గారెలను నివేదించి ఘనంగా పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే గారెల వంటకంలో గ్రామస్తులు నిమగ్నమయ్యారు.



ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు జరిగాయి.  చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం ఆంజనేయస్వామికి, సువర్చలాదేవికి  కన్నుల పండువగా కల్యాణం నిర్వహించారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top