గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా.. భయాందోళనలో వాహనదారులు


పెద్దపల్లి:

జిల్లాలోని ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో ఓ గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. కరీంనగర్‌-రాయపట్నం రహదారిలో విశాఖ నుంచి నాగ్‌పూర్‌ వెళ్తున్న హెచ్‌పీ గ్యాస్‌ ట్యాంకర్‌(కేఏ 01 ఏజీ 3552) అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్‌ డ్రైవర్‌, క్లీనర్‌లకు గాయాలు కాగా ట్యాంకర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతోంది.



దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్‌ సిబ్బంది సాయంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top