'పొమ్మనకుండా పొగ పెడుతున్నారు'

'పొమ్మనకుండా పొగ పెడుతున్నారు' - Sakshi


తిరుపతి : కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడుపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు నిప్పులు చెరిగారు. శనివారం తిరుపతిలో గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ.. పొమ్మనకుండా పొగ పెడుతున్నారంటూ బీజేపీ నేతలపై గాలి మండిపడ్డారు. ఎన్డీయే నుంచి వెళ్లిపొమ్మంటే పోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.


ఏపీకి ప్రత్యేక నిధులు ఏమీ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం కోసం మాత్రం రూ. 350 కోట్లు ఇచ్చారన్నారు. ఇలా అయితే రాజధాని నిర్మాణం ఎన్నో సంవత్సరాలు పడుతోందని గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top