నేటినుంచి వరుణ జపాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్ర ఉపాలయం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి 28వ తేదీ వరకు వరుణ జపాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. దీనిలో భాగంగా జరుగనున్న సహస్ర ఘటాభిషేకం నిమిత్తం ఘటాలు గురువారం ఆలయానికి చేరుకున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి, రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ మూడు రోజులపాటువరుణ సూక్త పారాయణలు, వారుణానువాక జపాలు, రుద్రహోమం, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించనున్నారు. 28న సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నారు.