తాడేపల్లి పరిధిలో మృతదేహాలు స్వాధీనం


గుంటూరు : గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో మూడు మృతదేహాలను మంగళవారం స్థానికులు కనుగొన్నారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట సమీపంలో పంటపొలాల్లో ఓ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే బకింగ్హామ్ కెనాల్లో 30 ఏళ్ల యవకుడి మృతదేహంతోపాటు వడ్డేశ్వరంలోని ఏపీఎస్టీ క్యాంప్ సమీపంలో రహదరి వద్ద 35 ఏళ్ల వ్యక్తి మృతదేహన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఈ మూడు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలను పోలీసులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుంచనపల్లి గ్రామంలో ప్రొక్లెయిన్‌తో మట్టిపెళ్లలు తొలగిస్తుండగా.. ఆ క్రమంలో 25 ఏళ్ల మహిళపై అవి పడ్డాయి. ఈ ఘటనలో సదరు మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో మహిళ మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top