గుప్త నిధుల కోసం..

గుప్త నిధుల కోసం.. - Sakshi


ముద్దనూరు:

 మండలంలోని బొందలకుంట గ్రామంలో గుప ్తనిధుల కోసం శ్రీబసవేశ్వర స్వామి విగ్రహాన్ని పగలగొట్టడానికి మంగళవారం అర్ధరాత్రి సమయంలో దుండగులు యత్నించారు. స్థానికుల సమాచారం మేరకు  శతాబ్దాల క్రితం నాటి పురాతన శ్రీ బసవేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీబసవేశ్వర స్వామి విగ్రహంలో గుప్తనిధులు ఉన్నాయని భావించిన దుండగులు విగ్రహం పైభాగంలో చిత్రీకరించిన చక్రం ఆకారాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం పై భాగంలో వీపుపై రసాయనాలతో రంధ్రం చేయడమే గాకుండా,వీపు కిందపక్కన కూడా పగలగొట్టడానికి యత్నించారు. అయితే బసవేశ్వర విగ్రహం ఇరుకైన మండపంలో నెలకొల్పి ఉండడంతో విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి వీలు కాలేదు. కాగా, మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఓ వాహనం ఆలయ ప్రాంతానికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

 

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top