వర్షం కారణంగా దేహదారుఢ్య పరీక్షలు నిలిపివేత
వర్షం కారణంగా బుధవారం జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు నిలిపివేశారు. దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించే మేకల అభినయ్ స్టేడియం బురదమయంగా ఉండటంతో ఈవెంట్స్ నిర్వహించడం అధికారులకు సాధ్యం కాలేదు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే తెలియజేస్తాం అని అన్నారు.