విశాఖ మన్యంలో భీకరంగా కాల్పులు


జీకే వీధి: విశాఖ ఏజెన్సీ పరిధిలో శుక్రవారం రాత్రి మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. జీకే వీధి మండలం నడుంవీధి అటవీ ప్రాంతంలో రాత్రి 7 గంటల సమయంలో ఇరు వర్గాల మధ్య అరగంట సేపు హోరా హోరీ కాల్పులు జరిగాయి. అయితే, ఇరు వైపులా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. తమ బలగాలకు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు ధ్రువీకరించారు.


మావోయిస్టు అగ్రనేతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top