తెలంగాణ, ఏపీ ఉద్యోగుల మధ్య ఘర్షణ.. ఉద్రిక్తం
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల జలవిద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
రీ జాయినింగ్ కోసం వచ్చిన 25 మంది ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్లను తెలంగాణ జెన్కో ఉద్యోగులు అడ్డుకున్నారు. దాంతో ఇరు రాష్ట్రాల ఉద్యోగుల మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరడంతో ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది.