కొడుకు చావు వార్త విని తండ్రి మృతి
అన్నపురెడ్డిపల్లి(ఖమ్మం):
ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుకు గురై తండ్రి మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండలం బుచ్చన్నగూడెం గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది.
గ్రామానికి చెందిన మెట్టు వేదప్ప కుమారుడు రామారావు అనారోగ్యం బారిన పడి ఆదివారం మృతిచెందాడు. విషయం తెలియగానే వేదప్ప గుండెపోటుకు గురై మృతిచెందాడు.