భార్యపై కోపంతో పిల్లల గొంతుకోసిన తండ్రి
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం శేరుపల్లిలో శనివారం దారుణం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావటం లేదని భర్త ఆగ్రహంతో విచక్షణ రహితంగా ప్రవర్తించాడు.
ఇద్దరి పిల్లల్ని గొంతుకోసి తండ్రి సుభాష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారులు స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.