‘నీరు విడుదల చేయకుంటే ఆత్మహత్యలే’


మానవపాడు: జూరాల ఆర్డీఎస్ కాలువలకు వెంటనే నీరు విడుదల చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. నెల రోజులైన నీరు విడుదల చేయక పోవటంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని, దీంతో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వలు పరిశీలించేందుకు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ వస్తున్నారని తెలుసుకున్న సుమారు 200 మంది రైతులు శనివారం ఆర్డీఎస్ ప్రధాన కాల్వ వద్దకు వచ్చారు.  తమ సమస్యలను వివరించి, వెంటనే నీరు విడుదల చేయాలని కలెక్టర్‌కు రైతులు వినతిపత్రం సమర్పించనున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top