బావిలో దూకి రైతు ఆత్మహత్య


వికారాబాద్‌ : అప్పుల బాధతో ఓ రైతు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న నారెగూడెం శ్రీనివాసరెడ్డి (48) తనకున్న ఎకరం పొలంతో మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని కూరగాయలతోపాటు పత్తి సాగు చేస్తున్నాడు. ఆ క్రమంలో ఇటీవల పొలంలో బావి తవ్వించాడు.


అలాగే తన ఇద్దరు కుమార్తెల వివాహం చేశాడు. దీంతో రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చే మార్గం కానరాక మంగళవారం రాత్రి అతడు బావిలో దూకి తనువు చాలించాడు. అయితే భర్త శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద మృతి అని అతడి భార్య అనంతమ్మ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top