టేకులపల్లిలో రైతు ఆత్మహత్యాయత్నం
ఖమ్మం : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి పంచాయతీ పరిధిలోని వెంకట్యాతండాకు చెందిన దారావత్ ధాన్యా అనే వ్యక్తి బుధవారం రాత్రి తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు ఆ విషయాన్ని గమనించి బాధితుడ్ని వెంటనే కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వెంటిలెటర్ పై ఉంచి వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. ధాన్యాకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చ లేక దారావత్ ధాన్యా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.