రైతు సమస్యలు విస్మరించిన ప్రభుత్వం

రైతు సమస్యలు విస్మరించిన ప్రభుత్వం - Sakshi


► మాజీ ఎమ్మెల్యే సీతమ్మ


దేవరకద్ర: రైతుల సమస్యలను ప్రభుత్వం విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే సీతమ్మ ఆరోపించారు. బుధవారం మండలంలోని డోకూర్, గోపన్ పల్లి, పుట్టపల్లి గ్రామాలలో ఆమె పర్యటించి టీడీపీ గ్రామ కమిటీలను వేసి మాట్లాడారు. కోయిల్‌సాగర్‌ ఆయకట్టు కింద వరి పంటలు వేసుకున్న రైతులకు నీళ్లు వదలకుండ అన్యాయం చేశారని ఆరోపించారు. మండలంలో దాదాపు వెయ్యి ఎకరాల మేర వరిపంటలు ఎండిపోయావని తెలిపారు.



అనంతరం కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎక్బాల్‌పాష, ప్రధాన కార్యదర్శి నాగరాజు, నాయకులు హన్మంతరెడ్డి, సత్యనారాయణ, సామ్రాట్‌ శ్రీనివాసులు, సుదర్శన్ గౌడ్, మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వర్నె, ముత్యాలంపల్లి, రేకులంపల్లి, పేరూర్, తదితర గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి పర్యటించి పార్టీ జెండాలను ఎగురవేసి గ్రామకమిటీలను నియమించారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top