టీడీపీ నేతల కుట్ర బట్టబయలు చేసిన ఏసమ్మ

టీడీపీ నేతల కుట్ర బట్టబయలు చేసిన ఏసమ్మ - Sakshi


సాక్షి, గుంటూరు : రైల్వే కాంట్రాక్టరు వాటా ఇవ్వలేదన్న కోపంతో  దాడులు జరిపిన తెలుగుదేశం నేతలు పన్నిన కుట్ర బట్టబయలయ్యింది. కాంట్రాక్టరుపై ఓ మహిళ చేత తప్పుడు కేసు పెట్టించిన సంగతి బైటపడింది. దాన్ని పెదనెవులిపురి గ్రావూనికి చెందిన దేపంగి ఏసవ్ము  వివరించింది. ఆమె మాటల్లోనే... ‘‘నేను ఎవరిమీద కేసు పెట్టలేదు..నన్ను ఎవరూ కులంపేరుతో దూషించలేదు.. ఇదంతా కుట్రపూరితంగా జరిగింది. నాకు తెలియకుండా ఈ కుట్ర రాజకీయంలో ఇరుక్కున్నా.


అసలు రైల్వే కాంట్రాక్టర్లు ఎవరినీ కలువలేదు. వారి ముఖం కూడా నాకు తెలియదు. వారు నా చేరుుపట్టుకున్నారనేది కూడా అవాస్తవం.  మీ రాజకీయాలకు నన్ను బలిచేయొద్దు.. ఏదో కాయ కష్టం చేసుకుని బతుకు వెళ్ళదీస్తున్నా.. మాజోలికి రావద్దయ్యా...’’ అంటూ ఆమె బుధవారం గుంటూరు రూరల్ అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు ఎదుట విలపించింది. తనను ఎవరో చేరుుపట్టుకొని కులంపేరుతో దూషించారని రాజుపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైరుునట్లు  పేపర్లో వచ్చిందని అందరూ చెప్పుకుంటుంటే బాధ అనిపించిందని తెలిపింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top