చినబొండపల్లి రేషన్ డీలర్పై విచారణ
పార్వతీపురం రూరల్: లబ్ధిదారులకు రేషన్ సరుకులు సక్రమంగా అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చినబొండపల్లి రేషన్ డీలర్ జక్కు తిరుపతిరావుపై సీఎస్డీటీ ఆవాల సూర్యనారాయణ బుధవారం విచారణ జరిపారు. గ్రామస్తుల ఫిర్యాదుపై రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. డీలర్ అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్ బోను దేవిచంద్రమౌళి, ఎంపీటీసీ గండి శంకరరావుల సమక్షంలో దుకాణాన్ని తెరచి సరుకులను వివరాలను లెక్కించారు. బియ్యం, పంచదార నిల్వల్లో తేడా ఉండటంతో పాటు విధి నిర్వహణలో డీలర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఎస్డీటీ వెల్లడించారు. ఆయనపై చర్యలు తీసుకుని దుకాణం ఇన్చార్జి బాధ్యతలను మరో డీలర్కు అప్పగిస్తామన్నారు.