జంట హత్యలపై విచారణ


శింగనమల : మండల కేం‍ద్రం సమీపంలోని రుష్యశృంగుని కొండపై జరిగిన జంట హత్యలపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఆదివారం కొండపైకి వెళ్లి సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. హత్యకు గురైన వారిది బత్తలపల్లి, గాయపడిన మహిళది ధర్మవరం కావడంతో ఆ రెండు మండలాల్లోనూ శింగనమల పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతి చెందిన పెద్దన్న ఎప్పటి నుంచి గంగమ్మ పూజారిగా ఉన్నారు, వీరి మేనల్లుడు ఈశ్వరయ్య, ధర్మవరానికి చెందిన సావిత్రికి పరిచయాలున్నాయా లేక గుప్తనిధుల కోసం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top