విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి


కరీంనగర్: పొలానికి నీళ్లు పెట్టేందుకు మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతిచెందిన సంఘటన శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో జరిగింది. పంటకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లిన సరోజన అనే మహిళ బావి వద్ద మోటర్ ఆన్ చేసేందుకు స్విచ్ బాక్స్‌ను పట్టుకుంది. విద్యుత్ షాక్ కొట్టి ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనలో భర్త రాజయ్య గాయాలతో బయటపడ్డాడు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top