సమాచారం పంపండి

సమాచారం పంపండి - Sakshi


► నియోజకవర్గాల పరిధిలో గ్రామాల జాబితా ఇవ్వండి

► జిల్లా యంత్రాంగానికి కేంద్ర ఎన్నికల కమిషన్  లేఖ




సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నియోజకవర్గాల సమగ్ర సమాచారం నివేదించాలని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) జిల్లా యంత్రాంగానికి లేఖ రాసింది. ఆయా నియోజకవర్గాల పరిధిలోకి ఏయే మండలాలు, గ్రామాలు వస్తాయనే వివరాలను తక్షణమే పంపాలని ఆదేశించింది. అదే పట్టణ నియోజకవర్గాలయితే.. వార్డుల హద్దుల సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు అదనపు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ అనూప్‌సింగ్‌ లేఖ రాశారు.


నియోజకవర్గాల పునర్విభజనను నిర్వచిస్తూ లేఖలో రాసినప్పటికీ, ఇది రొటీన్ లో భాగంగా జరుగుతున్న ప్రక్రియ మాత్రమేనని అధికారవర్గాలంటున్నాయి. ఇదిలా ఉండగా, ఈసీ అడిగిన సమాచారాన్ని తక్షణమే పంపాలని ఆర్డీఓ, తహసీల్దార్లను జిల్లా యంత్రాంగం ఆదేశించింది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు వేర్వేరు జిల్లాల్లో కలిసినందున.. దానికి అనుగుణంగా సమాచారాన్ని సేకరించాలని నిర్దేశించింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top