లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: 8 మందికి గాయాలు


మెదక్ : మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం నిజాంపేటలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.


అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top