స్వచ్ఛందంగా మెుక్కలు నాటాలి
మెట్పల్లి : పర్యావరణ పరిరక్షణకోసం ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సూచించారు. పట్టణంలోని ఖాదీ ప్రతిష్టాన్లో సోమవారం హరితహారం నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మర్రి ఉమారాణి, నాయకులు మర్రి సహదేవ్, ద్యావత్ నారాయణ, సోమిడి శివ, ఖాదీ జీఎం వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.