మధ్యాహ్నం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు


ఖమ్మం క్రైం: నగరంలో తొలిసారిగా ట్రాఫిక్‌ పోలీసులు మధ్యాహ్నం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. సోమవారం ట్రాఫిక్‌ సీఐ నరేష్‌రెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీ చేసి, మధ్యాహ్నం మందు తాగి వాహనం నడుపుతున్న పదిమందిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ నరేష్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అకస్మాత్తుగా పగలు కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడతామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు మధ్యాహ్నం కూడా పెరగడం.. అదీ మద్యం తాగి నడిపే వారి వల్లనే ఎక్కువగా జరగడంతో ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తనిఖీల్లో ఎస్సైలు ప్రభాకర్, దేవేందర్‌ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top