28న డీఆర్డీఏ మెగా జాబ్మేళా
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను ఈ నెల 28వ తేదీన ఉదయం 10గంటలకు బి.తాండ్రపాడు టీటీడీసీలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ,ఐటీఐ, బీటెక్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 19 నుంచి 30 ఏళ్లలోపు వయసు కల్గిన అభ్యర్థులు సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులతో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లోని డీఆర్డీఏ-ఈజీఎం కార్యాలయంలో ప్రత్యక్షంగా కానీ, ఫోన్(8099855969, 9177016174) ద్వారా కానీ సంప్రదించాలన్నారు.