నాగల్కడ్మూర్ గ్రామస్తుల రాస్తారోకో
నర్వ : కొత్తగా ఏర్పాటు చేయనున్న అమరచింత మండలంలో నాగల్కడ్మూర్ గ్రామాన్ని విలీనం చేయొద్దంటూ గ్రామ సర్పంచ్ తిప్పన్న ఆధ్వర్యంలో గురువారం గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్వ మండలంలో కొనసాగుతున్న నాగల్కడ్మూర్ గ్రామాన్ని అకారణంగా విడగొట్టి కొత్త మండలంలో నెట్టేస్తామని అధికారులు తీసుకున్న చర్యలను వారు తీవ్రంగా విమర్శించారు. అమరచింత వద్దు.. నర్వనే ముద్దు అంటూ నినాదాలు చేస్తు తమ గ్రామాన్ని నర్వ మండలంలోనే కొనసాగించాలని రహదారిపై మూడు గంటల పాటు బైఠాయించి తమ నిరసనను వ్యక్త పరిచారు. కార్యక్రమంలో గ్రామ యువకులు, మహిళలు పాల్గొన్నారు.