కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి


కట్ట రాంపూర్ (కరీంనగర్ జిల్లా) : గొర్రెల మందపై కుక్కలు దాడి చేసిన ఘటనలో 30 గొర్రెలు మృతిచెందగా.. మరో పది గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలోని కట్టరాంపూర్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ కాపరి గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 30 గొర్రెలు మృతిచెందాయి. దీంతో సుమారు రూ. 3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top