పిచ్చికుక్క దాడిలో ఇద్దరి చిన్నారులకు గాయాలు
అద్దంకి: పట్టణంలోని నంబూరిపాలేనికి చెందిన రెండున్నరేళ్ల దార్ల నితీశ్కుమార్, ఇందిరానగర్లో ఇదే వయసు పిల్లవాడు కోట జితేంద్రలపై పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. చిన్నారులు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. పట్టణంలో ఇటీవల పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గతంలోనూ పదుల సంఖ్యలో చిన్నారులు, మహిళలను కుక్కలు కరిచిన దాఖలాలు ఉన్నాయి. నగర పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బెడద లేకుండా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.