పోటీ ఉద్యమాలు చేస్తారా?
టీఆర్ఎస్ నేతలపై రేవంత్ ధ్వజం
తొగుట: 2013 భూసేకరణ చట్టంతోనే మల్లన్న సాగర్ ముంపు బాధితులకు న్యాయం జరుగుతుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా ఏటిగడ్డ కిష్టాపూర్లో శనివారం ఆయన ముంపు బాధితులకు మద్దతుగా 48 గంటల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాభిప్రాయం సేకరించకుండానే పేదల భూములు లాక్కోవడం దారుణమన్నారు.
స్థానిక టీఆర్ఎస్ నేతలు బ్రోకర్లుగా మారి రిజిస్ట్రేషన్ పేరుతో రూ.లక్షల కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. బాధితులకు వ్యతిరేకంగా కిరాయి నేతలతో పోటీ ఉద్యమాలు నిర్వహిస్తూ మంత్రి హరీశ్రావు పైశాచికానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. బాధితు లకు గ్రామానికిగ్రామం, భూమికి భూమి, ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.