నమ్మి ఒట్లేసిన ప్రజలను మోసగించొద్దు

నమ్మి ఒట్లేసిన ప్రజలను మోసగించొద్దు

యాదగిరిగుట్ట : సీఎం కేసీఆర్‌ను నమ్మి ఓట్లేసి గెలిపించిన రాష్ట్ర ప్రజానికాన్ని మోసగించొద్దని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌లు హితవు పలికారు. ఆదివారం యాదగిరిగుట్టకు వచ్చిన వారు విలేకరులతో మాట్లాడారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఒరిగిందేమి లేదని విమర్శించారు. ఇప్పటికైనా తాను చేసిన హామీలపై సీఎం కేసీఆర్‌ ఆత్మపరిశీలన చేసుకొని, ప్రకటించిన పథకాలు అమలు అయ్యేది.. కానిది ప్రజా కోర్టులో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో అమలు నోచుకొని పథకాలను ప్రస్తావించి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌ పక్కన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించినట్లే ప్రచారాన్ని ఊదరగొట్టడం రాష్ట్ర ప్రజానీకాన్ని మోసగించడమేనన్నారు. తెలంగాణ సర్కార్‌ చేయబోయే అభివృద్ధికి తామెప్పుడు అడ్డుపడమని, లొసుగులతో రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. మాజీ జెడ్పీ చైర్మన్‌ కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల, పట్టణ అ«ధ్యక్షుడు బీర్ల ఐలయ్య, గుండ్లపల్లి భరత్‌గౌడ్, ఎంపీటీసీలు సాధునేని మధుకర్, బుగ్గ పర్వతాలు, కలకుంట్ల బాలనర్సయ్య,  సుడుగు శ్రీనివాస్‌రెడ్డి, పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, గుండ్లపల్లి నర్సింహగౌడ్, ఆకుల గణేష్, బొజ్జ సాంబేష్‌ తదితరులున్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top