పోలీసుల సమస్యలపై డీజీపీ సానుకూలం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పోలీసుల సమస్యల పరిష్కారానికి డీజీపీ నండూరి సాంబశివరావు సానుకూలంగా స్పందించినట్లు జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు టి.నారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ తెలిపారు. శుక్రవారం ఉదయం విజయవాడలో అన్ని జిల్లాల పోలీసు అధికారులు సంఘం నాయకులు డీజీపీతో సమావేశమై పలు డిమాండ్లను ఆయన ముందు ఉంచామన్నారు. ముఖ్యంగా ప్రయాణ భత్యాన్ని పెంచాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు చేయూతనివ్వాలని, విజయవాడలో డార్మెట్రీని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.