తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తలు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.
కాలి నడకన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) 52,257 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.