తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ


తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం స్వల్పంగా పెరిగింది. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఇప్పటికే 8 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి ఉచిత దర్శనానికి 6 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అయితే రేపు రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం వరుస సెలవులు కావడంతో ఆయా రోజుల్లో భక్తులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top