ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో దోపిడీ: భట్టి
చేవెళ్ల: ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ అనుబంధ సంస్థలను బలోపేతం చేయనున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల సమీక్ష సమావేశం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో బుధవారం జరిగింది.
ఈ కార్యక్రమంలో భట్టివిక్రమార్క మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకు తాగునీరందించడానికి అప్పటి సీఎం వైఎస్ రూ. 36వేల కోట్లతో ప్రాణహిత ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే.. దాన్ని ఈ ప్రభుత్వం రీ డిజైనింగ్ చేసిందన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు పి.సబితారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల అండ, కార్యకర్తల బలం ఉన్నాయన్నారు.