డెంగీ లక్షణాలతో యువకుడి మృతి
సింగరాయపాలెం (కొణిజర్ల ) : డెంగీ జ్వరం లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని సింగరాయపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బలమాల జయరాజు(35) గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ప్లేట్లెట్లు పడిపోవడంతో ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే జ్వరం తీవ్రత పెరగడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించాలని ప్రయత్నాలు సాగిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. అయితే గ్రామంలో చాలా మంది విష జ్వరాలతో బాధపడుతున్న అధికారులు కనీసం బ్లీచింగ్ కూడా చల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.