ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

మంగళగిరి: రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే ఎస్టీ కమిషన్‌ వేసి తమ సమస్యలు పరిష్కరించాలని స్టద్వా (షెడ్యూల్‌ ట్రైబల్స్‌ అవేర్‌నెస్‌ డెవలప్‌మెంట్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌) అధ్యక్షుడు ఎం.కొండలరావు డిమాండ్‌ చేశారు. కొత్తపేటలోని స్టద్వా కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కొండలరావు మాట్లాడుతూ.. ఎస్టీ కమిషన్‌ ఏర్పాటుచేయడమే కాక గిరిజనులకే గిరిజన మంత్రిత్వ శాఖ కేటాయించి వారి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు మొగిలి మధు మాట్లాడుతూ.. గిరిజనుల ఆస్తులను ఆక్రమించినవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.  కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను ప్రభుత్వానికి పంపి అమలయ్యే వరకు పోరాడతామని హెచ్చరించారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top