ముద్రగడ వద్దకు దాసరి

ముద్రగడ వద్దకు దాసరి - Sakshi


హైదరాబాద్‌: ముద్రగడ పద్మనాభం దీక్షకు ప్రముఖ దర్శకుడు, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు మద్దతు పలికారు. ఆయన రేపు కిర్లంపుడికి వెళుతున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం కిర్లంపుడిలోని తన నివాసంలో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.



ఈ దీక్షకు ఇప్పటికే సంఘీభావం తెలిపేందుకు పలువురు నేతలు వస్తున్నప్పటికీ పోలీసులు వెనక్కి పంపిస్తుండటంతో అక్కడ కొంత టెన్షన్ పూరిత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు దాసరి వెళ్లడం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top