వ్యవసాయ కూలీ అనుమానాస్పద మృతి


కర్నూలు: ఓ వ్యవసాయ కూలీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కర్నూలు జిల్లా నందవరం మండలం సోమలగూడానికి చెందిన మద్దిలేటి బతుకు దెరువుకోసం మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లాడు. జిల్లాలోని మందకల్ మండలంలోని ఓ గ్రామంలో వ్యవసాయ పనిచేస్తూ బావిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top