సీపీఎం కార్యాలయంపై దాడిని ఖండించాలి


ఒంగోలు: ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు దాడి చేయడాన్ని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. బీజేపీ మతతత్వ అజెండాతో ముందుకు వె ళ్తోందన్నారు. ప్రజా సంక్షేమానికి, దేశ అభివృద్ధికి కృషి చేస్తామని ఆ పార్టీ నేతలు పైకి చెబుతూ చాప కింద నీరులా ఆర్‌ఎస్‌ఎస్ విస్తరణకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ దాడిని ప్రజాతంత్రవాదులంతా ఖండించాలని, అందుకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పూనాటి ఆంజనేయులు డిమాండ్ చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top