తెలంగాణలో దొరల ప్రభుత్వం: సీపీఐ


తెలంగాణలో దొరల ప్రభుత్వం నడుస్తోందని సీపీఐ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి అన్నారు. శుక్రవారం దామరచర్లలో పార్టీ సమావేశాలకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ఆ హామీ విస్మరించడంతోపాటు ఎక్కువ మంది అగ్రవర్ణాల వారికే మంత్రి పదవులను కట్టబెట్టారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఎన్నికల ప్రణాళికలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top