దంపతుల హత్య : రక్తపు మడుగులో మృతదేహాలు
ఒంగోలు : ప్రకాశం జిల్లా నాగులుప్పపాడు మండలం పోతవరంలో దంపతులు ఊటుకూరు సూర్యనారాయణ (65), విజయలక్ష్మీ (60) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గురువారం ఉదయం స్థానికులు ఆ విషయాన్ని గమనించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దంపతుల మృతదేహలు రక్తపు మడుగులో పడి ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనానికి వచ్చి.... వీరిని హత్య చేశారా ? లేక కావాలనే ఈ దంపతులను అంతమొందించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.