తిరుపతిలో రేపు కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ బుధవారం తిరుపతిలో ప్రత్యేక అంశంపై ప్రజా బ్యాలెట్ నిర్వహించనుంది. ప్రత్యేక హోదా అవసరమా? వద్దా? ఎన్నికల హామీలను చంద్రబాబు అమలు చేస్తున్నారా? విస్మరిస్తున్నారా? అనే అంశంపై కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తోంది. 28న ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట (మునికోటి ప్రాంగణం)లో జరిగే ప్రజా బ్యాలెట్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యులు చిరంజీవి, కేవీపీ రామచంద్రారావుతోపాటు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ ప్రజా బ్యాలెట్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటున్నారని, వారితోపాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చారు.