లెదర్‌ పార్కు కోసం కాంగ్రెస్‌ రాస్తారోకో


చొప్పదండి(కరీంనగర్‌ జిల్లా): చొప్పదండి మండల రుక్మాపూర్‌ గ్రామంలో గల రిజర్వు భూముల్లో  లెదర్ పార్కు ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెసు పార్టీ  గ్రామ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎల్పీ ఉప నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మృత్యుంజయం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. లెదర్ పార్కు ఏర్పాటుకు ఎమ్మెల్యే బొడిగ శోభ బాధ్యత వహించాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని విమర్శించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top